Categories: LATEST UPDATES

రాణీ క‌ల‌ల గృహం

ముంబైలోని రుస్తోంజీ ప్యార‌మౌంట్ అపార్టుమెంట్‌లో చేరిన ఐదో సెల‌బ్రిటీ.. బాలీవుడ్ న‌టి రాణీ ముఖర్జీ ( Rani Mukherjee ). బాలీవుడ్ ట్రెండింగ్ జంట దిశా పతానీ మరియు టైగర్ ష్రాఫ్.. క్రికెట‌ర్లు హార్దిక్ మరియు కునాల్ పాండ్యలు రుస్తుంజీ పారామౌంట్‌లో ఫ్లాట్ కొన్నారు. ఇందులోకి అడుగుపెట్టిన ఐదో సెల‌బ్రిటీయే.. రాణీ ముఖ‌ర్జీ. త‌న‌కు ఇష్ట‌మైన ఫ్లాటును కొనుగోలు చేసిందట. ఈ ఫ్లాట్ నుంచి అరేబియా స‌ముద్రం అందాల్ని ఆస్వాదించ‌వ‌చ్చు.

అందుకే, ప్ర‌తిఒక్క ముంబైవాసికి ఈ అపార్టుమెంట్‌లో నివ‌సించాల‌నే క‌ల‌లు కంటారు. ఈ 22 అంత‌స్తుల అపార్టుమెంట్‌లో 3545 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ రాణీ తీసుకున్నారు. ధ‌ర‌.. సుమారు రూ.7.12 కోట్లు. రెండు కార్ పార్కులు, ఔట్‌డోర్ ఫిట్‌నెస్ స్టేషన్, కృత్రిమ రాక్-క్లైంబింగ్ ప్రాంతం మరియు స్టార్ గేజింగ్ డెక్ వంటివి ఉన్నాయి.

This website uses cookies.