Categories: LEGAL

రూ.12.9 కోట్ల మోసం బిల్డర్ పై కేసు..

22 మంది కొనుగోలుదారులను రూ.12.90 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఓ బిల్డర్ పై కేసు నమోదైంది. నాగ్ పూర్ కు చెందిన శశాంక్ గోవింద్ ప్రసాద్ పాండే (46)పై ఆర్ధిక నేరాల విభాగం ఈ మేరకు చీటింగ్ కేసు నమోదు చేసింది. వంజరి నగర్ లో దివ్య ప్రయాగ అపార్ట్ మెంట్ నిర్మించిన పాండే.. 22 ఫ్లాట్లను డీహెచ్ఎఫ్ ఎల్ బ్యాంకుకు తనఖా పెట్టారు. అనంతరం ఆ మోర్టగేజ్ ఫ్లాట్లను రూ.12.90 కోట్లకు విక్రయించేశారు. అవి మోర్టగేజ్ ఫ్లాట్లు అనే విషయాన్ని దాచిపెట్టి 22 మందికి అమ్మేశారు. తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

This website uses cookies.