Categories: LATEST UPDATES

రూ.23 కోట్లకు బిగ్ బీ ‘సోపాన్’ విక్రయం

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఢిల్లీలోని తన పాత ఇంటిని అమ్మేశారు. గుల్మొహర్ పార్క్ లో ఉన్న ‘సోపాన్’ అనే బంగ్లాను రూ.23 కోట్లకు విక్రయించారు. 35 ఏళ్లుగా బచ్చన్ కుటుంబానికి బాగా తెలిసిన నెజోన్ గ్రూప్ సీఈఓ అవ్ని బాదర్ ఆ బంగ్లా కొనుగోలు చేశారు. 418.05 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా రిజిస్ట్రేషన్ సైతం డిసెంబర్ 7న పూర్తయిందని సమాచారం. తమ కుటుంబ ఆస్తిగా ఉన్న సోపాన్ గురించి అమితాబ్ పలుమార్లు తన బ్లాగ్ లో కూడా ప్రస్తావించారు. బిగ్ బీ తల్లి తేజి బచ్చన్ పేరు మీద ఉన్న ఆ బంగ్లాలో బిగ్ బీ తల్లిదండ్రులు ఉండేవారు.

అమితాబ్ ముంబైకి వెళ్లకముందే ఇక్కడే ఉండేవారు. ఆయన ముంబై వెళ్లిన తర్వాత బిగ్ బి తల్లిదండ్రులు కూడా ఇక్కడ నుచి వెళ్లిపోయారు. చాలా కాలంగా ఆ బంగ్లాలో ఎవరూ ఉండటంలేదు. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని అమితాబ్ విక్రయించారు. ‘అది చాలా పాత నిర్మాణం. అందువల్ల దానిని కూలగొట్టి, మాకు కావాల్సిన విధంగా కొత్త ఇంటిని కట్టుకుంటాం. ఈ ప్రాంతంలో మేం చాలాకాలం నుంచి ఉంటున్నాం. మా అవసరాలకు మరికొంత స్థలం కోసం చూస్తుండగా ఈ ఆఫర్ వచ్చింది. వెంటనే కొనుగోలు చేశాం’ అని బాదర్ తెలిపారు.

This website uses cookies.