Categories: LATEST UPDATES

బిల్డ‌ర్ల‌కు అప్ప‌చెబుతున్న‌.. రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్లు

  • బిల్డ‌ర్ల‌కు వేలంలో విక్ర‌యం

రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్ల‌ను బిల్డ‌ర్ల‌కు వేలం పాట‌లో విక్ర‌యించేందుకు ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నామ‌ని
పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన క‌స‌రత్తును ఆరంభించామ‌ని చెప్పారు. గురువారం ఆయ‌న క్రెడాయ్ తెలంగాణ స్టేట్ కాన్‌క్లేవ్ కార్య‌క్ర‌మంలో రియ‌ల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల కోసం అవ‌స‌ర‌మ‌య్యే రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్ల‌ను పూర్తి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కొంత‌కాలం క్రితం ఇందుకు సంబంధించిన నిర్మాణ ప‌నులు నిలిచిపోయాయ‌ని.. అందుకే, ఆయా నిర్మాణాల్ని వేలంలో బిల్డ‌ర్ల‌కు విక్ర‌యిస్తామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఆగిపోయిన ప‌నుల‌న్నీ బిల్డ‌ర్లు పూర్తి చేసి.. కొనుగోలుదారుల‌కు అందుబాటు ధ‌ర‌లో అంద‌జేస్తార‌ని చెప్పారు.

రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్ల‌ను డెవ‌ల‌ప‌ర్ల‌కు అంద‌జేయ‌డం మంచి ఆలోచ‌న అని క్రెడాయ్ నేష‌న‌ల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. ఒక‌వేళ ప్ర‌భుత్వం వాటిని త‌మ‌కు అప్ప‌గిస్తే.. నాణ్య‌తా ప్ర‌మాణాల్ని ప‌రిశీలించి.. స‌కాలంలో పూర్తి చేసి కొనుగోలుదారుల‌కు అంద‌జేస్తామ‌ని చెప్పారు. ఈ ర‌కంగానైనా ప్ర‌జల‌కు అందుబాటు ధ‌ర‌లో ఫ్లాట్లు ల‌భిస్తాయ‌న్నారు.

This website uses cookies.