Categories: PRESS RELEASE

‘‘కంట్రోల్ ఎస్’’ కు యూఎస్ జీబీసీ అవార్డు

యూఎస్ జీబీసీ 2021 యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇండియా మరియు ఆగ్నేయాసియా లీడర్‌షిప్ అవార్డు గ్రహీతలను ప్రకటించింది. స్థిరమైన, ఆరోగ్యకరమైన, సమానమైన మరియు స్థితిస్థాపక భవనాలు, నగరాలు మరియు సంస్థల సృష్టికి దోహదపడే వ్యక్తులు మరియు సంస్థలకు లీడర్ షిప్ అవార్డుల్ని యూఎస్ జీబీసీ లీడర్‌షిప్ ప్రకటిస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో కార్యకలాపాల్ని నిర్వర్తించే ‘కంట్రోల్ ఎస్’ (CtrlS ) సంస్థకు యూఎస్ జీబీసీ అవార్డును ప్రకటించింది. భారత దేశంలోని CtrlS డేటా సెంటర్లు LEED ప్లాటినం ధృవీకరణతో గుర్తింపు పొందిన ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఒకటి అని చెప్పొచ్చు. యూఎస్ జీబీసీ అవార్డుల్ని అందుకున్న సంస్థల్లో చెన్నైకు చెందిన ఎంజీఎం హెల్త్ కేర్, ఐటీసీ హోటల్స్, ఎంబసీ గ్రూపులున్నాయి.

This website uses cookies.