Categories: Celebrity Homes

జాన్వీ ఫ్లాట్ కొన్న‌ రాజ్ కుమార్ రావు

  • రూ.44 కోట్లు వెచ్చించిన బాలీవుడ్ నటుడు

బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు ముంబై జుహూ ప్రాంతంలో విలాసవంతమైన ట్రిప్లెక్స్ ఫ్లాట్ సొంతం చేసుకున్నారు. శ్రీదేవి, బోనీకపూర్ ల కుమార్తె, నటి జాన్వీ కపూర్ కు దాదాపు రూ.44 కోట్లు చెల్లించి ఈ ఫ్లాట్ దక్కించుకున్నారు. దాదాపు 1.27 లక్షల చదరపు అడుగుల్లో ఉన్న ఈ ఫ్లాట్ కొనుగోలు.. దేశంలోనే అత్యంత ఖరీదైన లావాదేవీల్లో ఒకటిగా నిలిచింది. జాన్వీ కపూర్ ఈ ఫ్లాట్ ను 2020 డిసెంబర్ లో కొనుగోలు చేశారు.

ప్రస్తుతం దానిని తన భార్య పత్రలేఖ మిశ్రా పాల్ తో కలిసి రాజ్ కుమార్ రావు అలియాస్ రాజ్ కుమార్ యాదవ్ కొనుగోలు చేశారు. ఈ అపార్ట్ మెంట్ 14, 15, 16వ అంతస్తులో ఉంది. ఇప్పటికే రాజ్ కుమార్ దంపతులకు అదే భవనంలోని 11, 12వ అంతస్తుల్లో ఓ ఫ్లాట్ ఉంది. కాగా, జాన్వీ ఫ్లాట్ కొనుగోలు కోసం స్టాంపు డ్యూటీ కింది రూ.2.19 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ ఫ్లాట్ కొనుగోలుతో రాజ్ కుమార్ కు ప్రత్యేకంగా ఆరు కారు పార్కింగ్ స్లాట్లు కూడా లభిస్తాయి. గతనెల 21న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పూర్తయింది.

This website uses cookies.