Categories: LATEST UPDATES

లీజుకివ్వొద్దు.. అమ్మేయడమే ముద్దు

జీఎస్టీ భారం తప్పించుకోవడానికి
ప్లాట్లను అమ్మకానికి పెట్టిన ఏఎంసీ

జీఎస్టీ భారం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ)కి శాపంగా పరిణమించింది. తన ప్లాట్లు, భవనాలను లీజుకు ఇవ్వడానికి నానా తంటాలు పడుతోంది. ప్లాట్లు లేదా బిల్ట్ ప్రాపర్టీని లీజుకు తీసుకుంటే 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది లీజుదారుకు భారంగా పరిణమించడంతో లీజుకు తీసుకురావడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో ఏఎంసీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. వాటిని లీజుకు ఇవ్వకుండా విక్రయించాలని నిర్ణయించింది. తద్వారా జీఎస్టీ భారం ఉండదని, ఫలితంగా చాలామంది వాటి కొనుగోలుకు ముందుకు వస్తారని అంచనా వేస్తోంది.

This website uses cookies.