poulomi avante poulomi avante

రూ.65 కోట్లతో ఇల్లు కొన్న జాన్వీ కపూర్

దివంగత నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్.. తన సోదరి ఖుషీ, తండ్రి బోనీ కపూర్ తో కలిసి ముంబై బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో విలాసవంతమైన డూప్లెక్స్ అపార్ట్ మెంట్ ను రూ.65 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. పాలి హిల్స్ యూనియన్ పార్క్ రోడ్డులోని కుబెలిస్క్యూ బిల్డింగ్ మొదటి, రెండు అంతస్తుల్లో 8,669 చదరపు అడుగుల్లో ఈ డూప్లెక్స్ ఫ్లాట్ ఉంది. ఇందులో ఓపెన్ గార్డెన్ ఏరియాతో పాటు మొదటి అంతస్తుల్లో ప్రత్యేకమైన స్విమింగ్ పూల్ కూడా ఉంది.

బిల్టప్ ఏరియాను బట్టి చూస్తే చదరపు అడుగుకు రూ.75 వేలు, కార్పెట్ ఏరియా ప్రకారమైతే చదరపు అడుగుకు రూ.1.01 లక్షలు చెల్లించినట్టు అవుతుంది. ఒప్పందం ప్రకారం ఐదు కారు పార్కింగులు జాన్వీ కుటుంబానికి వస్తాయి. ఇక స్టాంపు డ్యూటీ కింద జానీ కపూర్ కుటుంబం రూ.3.9 కోట్లు చెల్లించింది. గత నెల 12న రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇక టవర్ లో ఉన్న పెంట్ హౌస్ ను బంగ్లాలా వినియోగించుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. కాగా, జాన్వీ కపూర్ ఈ ఏడాది జూలైలో ముంబై జుహు ప్రాంతంలోని తమ విలాసవంతమైన ట్రిప్లెక్స్ అపార్ట్ మెంట్ ను నటుడు రాజ్ కుమార్ కు రూ.44 కోట్లకు విక్రయించారు. జాన్వీ ఆ ఇంటిని 2020 డిసెంబర్ లో కొనుగోలు చేశారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles