Categories: LATEST UPDATES

హొగర్ కంట్రోల్స్.. ‘ప్రైమా+ సిరీస్’ ఆవిష్క‌ర‌ణ

రోజువారీ జీవితంలో ప్రజలు సాంకేతికతను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఐఒటి ప్రభావం ఇప్పటికే ప్రతీ ఒక్క వినియోగదారు ఇంట్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హొగర్ కంట్రోల్స్ తన ప్రధాన ఉత్పాదన ప్రైమా+ స్మార్ట్ టచ్ ప్యానెల్స్ ద్వారా అనుసంధానిత జీవితాన్ని పునర్ నిర్వచిస్తోం ది.

భారతదేశంలో 6000కు పైగా ప్రాజెక్టుల్లో.. 50,000 యూనిట్లను రికార్టు స్థాయిలో విక్ర‌యించిన హొగర్ కంట్రోల్స్ హోమ్ ఆటోమేషన్ పరిశ్రమలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పింది. ఈ సంస్థ స్మార్ట్ టచ్ ప్యానెల్స్ రెట్రోఫిట్, వైర్లెస్ డిజైన్ తో వస్తాయి. ఇప్పటికే ఉన్న ఏ స్విచ్ బోర్డ్ పైనైనా సులువుగా ఫిట్ చేసుకోవ‌చ్చు. వైరింగ్ లో ఇబ్బంది ఉండదు. రీమోడలింగ్ చేయన‌క్క‌ర్లేదు.

This website uses cookies.