Categories: TOP STORIES

మూడేళ్లలో రూ.2.29 లక్షల కోట్లు

భారత్ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2022 నుంచి 2024 వరకు మూడేళ్లలో ఏకంగా రూ.2.29 లక్షల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. ఇందులో దాదాపు పావు శాతం.. అంటే రూ.57,600 కోట్లు ఒక్క ముంబైకే వచ్చాయి. ఈ వివరాలను సీఐఐ-సీబీఆర్‌ఈ సంయుక్త నివేదిక వెల్లడించింది. ముంబైతో పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బెంగళూరు ఈ మూడు మార్కెట్లోకి వచ్చిన పెట్టుబడులు 16.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది.

మొత్తం రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి 2022-24 మధ్య వచ్చిన పెట్టుబడుల్లో 62 శాతాన్ని ఈ మూడు నగరాలు దక్కించుకున్నాయి. గత మూడేళ్లలో 10 శాతం మేర ఈక్విటీ పెట్టుబడులు (3 బిలియన్‌ డాలర్లు) టైర్‌-2 పట్టణ రియల్‌ ఎస్టేట్‌లోకి వచ్చినట్టు తెలిపింది. భారత రియల్‌ ఎస్టేట్‌ రంగం కొత్త వృద్ధి పథంలోకి అడుగు పెట్టిందని.. బలమైన మూలధన పెట్టుబడులు, అభివృద్ధికి భూముల లభ్యత ఇందుకు మద్దతునిస్తున్నాయని సీబీఆర్‌ఈ భారత చైర్మన్‌, సీఈవో అంశుమ‌న్ మ్యాగ‌జీన్ తెలిపారు.

This website uses cookies.