Categories: LATEST UPDATES

రియల్ ఎస్టేట్ లో ఉత్తమ సీఈవో.. ఇర్ఫాన్ రజాక్

రియల్ రంగంలో దేశంలోనే ఉత్తమ సీఈవోగా ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇర్ఫాన్ రజాక్ ఎంపికయ్యారు. రిటైల్, రియల్ ఎస్టేట్ లో 48 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన రజాక్ ఈ గౌరవం పొందారు. ఇటీవల ముగిసిన బిజినెస్ టుడే వార్షిక సదస్సులో ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగ రజాక్ మాట్లాడుతూ.. తనకు ఈ గుర్తింపు రావడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ‘నా టీంలోని ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

వారి కృషి, మద్దతు లేకుండా ఈ గౌరవం పొందడం సాధ్యం కాదు. కస్టమర్ ఆనందం.. సకాలంలో డెలివరీ.. ఇదే మా విజయ మంత్రం. మేం అన్ని ప్రమాణాలలనూ అధిగమించి, కొత్త అభిరుచితో ముందుకు సాగుతున్నామనడానికి ఇదే నిదర్శనం. ప్రెస్టీజ్ గ్రూప్ ఎప్పటికీ గట్టిగా నిలబడుతుంది. అలాగే చెప్పినదానికి కట్టుబడి ఉంటుంది. ఇక వాణిజ్యపరంగా కూడా మేం కొన్ని కీలకమైన ప్రాజెక్టులు కలిగి ఉన్నాం’ అని పేర్కొన్నారు.

ప్రెస్టీజ్ గ్రూప్ ని రజాక్ 1986లో స్థాపించారు. అప్పటి నుంచి చెన్నై, హైదరాబాద్, కొచ్చి సహా పలు నగరాల్లో అనేక మిలియన్ చదరపు అడుగుల ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ అభివృద్ధిని పూర్తి చేసింది. అలాగే మంగళూరు, మైసూరు, గోవా, ఉదయ్ పూర్, బెంగళూరుతోపాటు ముంబై, ఢిల్లీ, పుణె, అహ్మదాబాద్ వంటి నగరాల్లోనూ బాగా విస్తరించింది.

This website uses cookies.