poulomi avante poulomi avante

విశాఖ మాస్టర్ ప్లాన్ పై మళ్లీ సమీక్ష

  • ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలకు వీఎంఆర్ డీఏ ఆహ్వానం

విశాఖపట్నం మాస్టర్ ప్లాన్-2041ని మళ్లీ సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించనుంది. విశాఖ మాస్టర్ ప్లాన్ ని 2021 నవంబర్ లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోదించింది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (వీఎంఆర్ డీఏ)ని వాటి అభివృద్ధి అవకాశాలు, పెట్టుబడి ఎంపికల ఆధారంగా పలు విధానపరమైన జోన్లుగా విభజిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, కొందరు ప్రముఖుల భూములను కాపాడే విధంగా ప్లాన్ లో మార్పులు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కు, తుది ప్లాన్ కు మధ్య భారీ తేడాలున్నాయని విమర్శలు వచ్చాయి. కొందరు ప్రముఖులకు లబ్ధి చేకూర్చేందుకే ఇలా చేశారని ఆరోపణలు వచ్చాయి. కీలకమైన ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాల్లో కొందరు నేతలు భూములు ముందుగానే కొనేశారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని కూటమి సర్కారు దీనిపై దృష్టి సారించింది. విశాఖ మాస్టర్ ప్లాన్ ని మళ్లీ సమీక్షించి, ప్రజల అభ్యంతరాలను పరిశీలించాలని వీఎంఆర్ డీఏని ఆదేశించింది. దీంతో ఈ అంశంపై మరోసారి ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలు ఆహ్వానించడానికి వీఎంఆర్ డీఏ సమాయత్తమవుతోంది.

‘విశాఖ మాస్టర్ ప్లాన్ ను మళ్లీ సమీక్షించి రివైజ్డ్ ప్లాన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఈ టెండరింగ్ ద్వారా ఓ ప్రైవేట్ కన్సల్టెంట్ ని నియమించి పూర్తి చేస్తాం. కన్సల్టెంట్ నియామకం పూర్తయిన తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు ఆహ్వానిస్తాం. అనంతరం వాటిన పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి తుది ప్లాన్ సమర్పిస్తాం’ అని వీఎంఆర్ డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ తెలిపారు.

spot_img
Hallmarkinfracon imperia

Hot Topics

Related Articles