poulomi avante poulomi avante

అయోధ్యలో భూమి కొన్న అమితాబ్

రూ.40 కోట్లతో 25వేల చదరపు అడుగుల భూమి కొన్న బిగ్ బి

బాలీవుడ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్ ఫోలియోను విస్తరించుకుంటున్నారు. తాజాగా టెంపుల్ సిటీ అయోధ్యలో రూ.40 కోట్ల వ్యయంతో భూమి కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా అభివృద్ధి చేస్తున్న వెంచర్ లో 25వేల చదరపు అడుగు ఫ్లాట్ ను కొన్నారు. ఇప్పటికే అమితాబ్ కు అయోధ్యలో ప్రాపర్టీలు ఉన్నాయి. 2024లో అమితాబ్ బచ్చన్ అయోధ్యలోనే అభినందన్ లోధా 7-స్టార్ ఎన్‌క్లేవ్ ది సరయులో రూ.14.5 కోట్లకు 10,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు.

తాజా ఫ్లాట్ ఈ ప్రాజెక్టు పక్కనే ఉంది. అలాగే 2025 మార్చిలో రామమందిరం నుంచి 10 కి.మీ దూరంలో హరివంశ్ రాయ్ బచ్చన్ ట్రస్ట్ పేరుతో 54,454 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. తన తండ్రి, దిగ్గజ హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ జీవితం, సాహిత్య సేవలకు గుర్తుగా స్మారక చిహ్నాన్ని స్థాపించడానికి ఈ భూమిని ఉపయోగించవచ్చని వార్తలు వచ్చాయి. 2024లో రామాలయం ప్రారంభోత్సవానికి ముందు, అమితాబ్ బచ్చన్ హవేలీ అవధ్‌లో 5,372 చదరపు అడుగుల ప్లాట్‌ను ₹4.54 కోట్లకు కొనుగోలు చేశారు.

అలాగే అలీబాగ్‌లో రూ.10 కోట్లకు 10,000 చదరపు అడుగుల భూమిని కొన్నారు. ఇలా అమితాబ్ తన రియల్ ఎస్టేట్ పోర్ట ఫోలియోను విస్తరిస్తున్నారు. కాగా, అయోధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. భూమి విలువలు పెరగడంతోపాటు ఆధ్యాత్మిక పర్యాటకం, దీర్ఘకాలిక పెట్టుబడి రెండింటిలోనూ ఆసక్తి పెరుగుతోంది. అయోధ్యలో భూమి ధరలు 19% సమ్మేళనం వార్షిక వృద్ధి రేటుతో పెరిగాయని, 2035 నాటికి ఇది 25%కి చేరుకుంటుందని అంచనాలు సూచిస్తున్నాయి.

గత ఐదేళ్లలో అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ, మెరుగైన రోడ్లు, రైలు కనెక్టివిటీ, రామమందిర నిర్మాణం వంటివాటితో ఈ నగరం అభివృద్ధి చెందింది. దీంతో భూముల రేట్లు 2020తో పోలిస్తే నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగాయి. అలాగే ఆతిథ్య రంగంలో కూడా దూసుకెళ్తోంది. 50 కి పైగా కొత్త హోటల్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ది లీలా, తాజ్ మరియు ది ఒబెరాయ్ వంటి ప్రముఖ లగ్జరీ హోటల్ చైన్‌లు అయోధ్య వైపు దృష్టి సారించాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles