Categories: LEGAL

రుణం ఎగవేత.. బిల్డర్ అరెస్ట్

బ్యాంకు నుంచి రూ.15 కోట్ల రుణం తీసుకుని ఎగవేసిన కేసులో ఓ బిల్డర్ ను ఎన్ ఫోర్స్ మెంట డైరెక్టరేట్ అరెస్టు చేసింది. తిరువనంతపురానికి చెందిన హీరా కన్ స్ట్రక్షన్స్ డైరెక్టర్ అబ్దుల్ రషీద్ అలియాస్ హీరాబాబు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి రూ.15 కోట్ల రుణం తీసుకున్నారు. అక్కులంలో హీరా లేక్ ఫ్రంట్ అపార్ట్ మెంట్ నిర్మాణం కోసం ఈ రుణం పొందారు.

అయితే, ప్రాజెక్టు పూర్తి చేయలేదు.. రుణాన్ని కూడా తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు తొలుత సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. అనంతరం మనీ ల్యాండరింగ్ కు సంబంధించిన అంశం కావడంతో కేసు ఈడీకి బదిలీ అయింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు హీరాబాబును కొచ్చిలో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేశారు.

This website uses cookies.