Categories: LATEST UPDATES

కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్.. బిల్డర్ పై కేసు

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నగదు తరలింపు కోసం కారుపై అక్రమంగా ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకున్న ఓ బిల్డర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై ఘట్కోపర్ కి చెందిన చంద్రకాంత్ గాంధీ అనే బిల్డర్ తన కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకున్నారు. దీనిని గమనించిన ఓ సామాజిక కార్యకర్త రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా.. కమిషన్ ఘట్కోపర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు చంద్రకాంత్ తోపాటు ఆయన ఇద్దరు కుమారులు ఆశిష్, మనీష్, మేనల్లుడు నీలేష్ లపై కేసు నమోదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించిన చంద్రకాంత్ కు మారుతి బ్రెజాను స్వాధీనం చేసుకున్నారు.

వాస్తవానికి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధులు తాము వాడే కార్లకు మాత్రమే ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకోవాలి. కానీ చాలామంది వ్యక్తులు అక్రమంగా తమ వాహనాలకు ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లను అతికించుకుని తిరుగుతుంటారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరం. ఈ క్రమంలో నగదును అక్రమంగా తరలించడానికే చంద్రకాంత్ తన కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కాగా, ఈ కేసులో తమను పోలీసులు అరెస్టు చేయకుండా ఆ నలుగురూ ముందుస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

This website uses cookies.